CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సమ్మెతో బుద్ధి చెప్పాలి:ఏ.జె రమేష్

Share it:


మన్యం టీవీ మణుగూరు:-

భారతదేశం లో నవంబర్ -26 న చారిత్రాత్మక సమ్మె జరగబోతోంది భారత కార్మిక వర్గం కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సమ్మె తో బుద్ధి చెప్పడానికి సిద్దం అవుతున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.జె రమేష్ అన్నారు.సీఐటీయూ కార్యాలయంలో చల్లా వెంకన్న అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశంలో ఏ.జె రమేష్ మాట్లాడుతూ,స్వాతంత్ర్య పూర్వం బ్రిటిష్ పాలకుల హయాంలో కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలను,హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడి దారులకు,విదేశీ సంస్థలకు జీ హుజుర్ అంటు 44 కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను,కార్పొరేట్ అనుకూలంగా మార్చడం దారుణం అన్నారు.పని గంటల పెంపు,కనీస వేతనాలు, ఇపీఎఫ్,ఇఎస్ఐ,సమ్మెలు చేయకుండా,సంఘాలు లేకుండా,ఇప్పడు కార్మిక చట్టల మార్పు తెచ్చారు,కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తెచ్చింది.దీనికి వ్యతిరేకంగా నవంబర్ 26న జరగబోయే సమ్మె చారిత్రాత్మక సమ్మె దేశంలో 45 కోట్ల మంది కార్మికులు ఉన్నారు.వారు అందరు సమ్మె లొ పాల్గొన్ని విజయవంతం చేస్తే భారతదేశం పూర్తిగా స్థంభించిపోతుందని అప్పడైనా  నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దల శ్రీనివాసరావు,నెల్లూరి నాగేశ్వరరావు,బండిరాజేష్, ఉప్పుతల నర్సింహరావు, పల్లపు నాగేశ్వరరావు,తులసి కృష్ణయ్య,రాము,ముత్తారావు, నివాస్,శంకర్,రాణి,రాధ, సాయమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: