మన్యంటీవీ,ములకలపల్లి: (నవంబర్ 10)ములకలపల్లి మండలలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతి లో హరితహరం నర్సరీ పనులను సర్పంచ్ సవలం.సుజాత ప్రారంభించారు.ఈ యొక్క నర్సరీ లో 12 వేలు మొక్కలు పెంచాలని మండల అధికారులు నిర్ణయించారు.మొక్కలు పెంచుటకు నర్సరీ కు పంపించిన పాలిథిన్ సంచులు నాణ్యత గా లేవని, సంచులలో ఎక్కువగా మట్టి,ఎరువులు కలిపి సర్దుబాటు చేసే క్రమంలో సంచులు చినిగిపొతున్నాయిని, ఇప్పుడే ఇలా ఉంటే మొక్కలను పెంచి పంపిణీ చేసే వరకూ సంచులు ఎలా ఆగుతాయని అనుమానాలు వ్యక్తపరిచారు. సంచి యెక్క సైజ్ లో కూడా తేడాలు ఉన్నాయి అని ఇ.జీ.ఎస్-టి.ఏ-మురళీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ-ప్లాంటేషన్ టి.ఏ-ఎస్.నాగమణీ, పంచాయతీ కార్యదర్శి-నారేందర్, పంచాయతీ సిబ్బంది,కూలీలు పాల్గొన్నారు.
Post A Comment: