మన్యం టీవీ,ములకలపల్లి: మండల పరిధిలో ఉన్న తిమ్మంపేట గ్రామంలో ధ్వంసమైన పల్లె పకృతి వనంను సందర్శించిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య,మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఈ ఘటనకు సంబధించిన వివరాలను తిమ్మంపేట గ్రామ సర్పంచ్ గౌరి లక్ష్మి మాటలతో ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనం దుండగులు ద్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు పార్కు ఏర్పాటు చేసిన మొక్కలను పీకేశారు, పెన్సింగ్ లను విరగొట్టారు. ఈ ఘటన స్థలానికి చేరుకొని గ్రామ సర్పంచ్ గౌరి లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి రాంబాబు,గ్రామ ప్రజలను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనం పై ఈ ఘటనకు సంబంధించిన దుండగుల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఎస్ ఐ సురేష్ తెలియపరిచిన్నారు.అలాగే మరల తిరిగి పకృతి వనం ఏర్పాటు చేయాలని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అశ్వారావుపేట టీ ఆర్ ఎస్ నియోజక వర్గ నాయకుడు జారే ఆదినారాయణ,ములకలపల్లి మండల ఎం పి పి మట్ల నాగమణి, ములకలపల్లి మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, సీతాయి గూడెం సర్పంచ్ కారం సుధీర్ ,తాళ్ల పాయి సర్పంచ్ బైటి రాజేష్,జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని, మాధారం సర్పంచ్ వాడే నాగరాజు, చౌటిగూడెం సర్పంచ్ తానం శ్రీను, టీ ఆర్ ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: