మన్యం టీవీ కొత్తగూడెం కలెక్టరేట్ నవంబర్ 9
భద్రాచలం ఎంపిడిఓ కార్యాలయం వెనుక రహదారి ఆక్రమణకు గురికావడం వల్ల రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలిగించినట్లు జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రహదారి ఆక్రమణ వల్ల రవాణాకు ఇబ్బంది పడుతున్నామని పలు మార్లు అధికారుల దృష్టికి తెచ్చామని కానీ పరిస్కారం కాలేదని సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కి పిర్యాదు చేయగా ఇంచార్జి సబ్ కలెక్టర్ గౌతమ్, పట్టణ ప్రత్యేక అధికారి విజేత, తహసీల్దార్ ప్రత్యేక చర్యలు తీసుకుని తక్షణమే ఆక్రమణలు తొలగించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆదేశాలు అమలు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: