మన్యం టీవీ ఏటూరునాగారం:
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి
చట్టాన్ని సక్రమంగా అమలు కోసం మరో ఐక్య ఉద్యమం చేపట్టాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు పై తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్ మాట్లాడుతూ చట్టం ప్రకారం నిధుల ఖర్చులో పారదర్శకత,జవాబుదారి పెంపొందించెందుకు చెపట్టాల్సిన సామాజిక తనిఖీ చేయడం లేదన్నారు.చట్టం అమలు,పర్యవేక్షణ కు రాష్ట్ర, జల్లా స్ధాయిలో ఏర్పాటు చేసి సమీక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నిధుల కేటాయింపులు, పధకాల అమలులొ జాప్యాన్ని నివారించడానికి ప్రత్యేక ఆర్ధిక కార్యదర్శి ని నియమించడం లేదని, ఖర్చు కాని నిధులను క్యారిపార్వర్డ్ చేయడం లేదన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో దళితుల అభివ్రుద్ది కి 16,173 వేల కోట్ల నిధులను కేటాయించగా కేవలం3547కోట్ల ను మాత్రమే ఖర్చు చెసి నిర్లక్ష్య,వివక్ష తను పాటిస్తుందన్నారు.స్వయం ఉపాది పధకాలను అమలు చేయడం లేదని, ప్రతి సంవత్సరం విడుదల చేయాల్సిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ ను గత రెండు సంవత్సరాలుగా విడుదల చేయకుండా దళితులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు.భూ పంపిణీ ని విస్మరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్, ప్రసాద్, ప్రవీణ్ ,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: