మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్, ఎస్ ఆర్ ఎస్ పి నిర్వహణ పై సమీక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు గట్టమ్మ దేవస్థానం వద్ద అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజిటర్స్ హాల్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ ప్రారంభించినారు.
ఈ సమావేశంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటిడిఏ పి ఓ హనుమంతు కె జండగే, ఆదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఛీప్ ఇంజనీర్ బంగారయ్య, ములుగు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: