మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మణుగూరు వారి ఆధ్వర్యంలో శనివారం 67వ అఖిల భారత సహకార వారోత్సవాలను సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు.సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు,ముందు కట్టలు, అలాగే రైతులకు గిట్టుబాటు ధర లభించే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ వంటి కార్యక్రమాలు సొసైటీలు నిర్వహిస్తున్నాయన్నారు.ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దొందేటి రామ్మోహన్ రావు, డైరెక్టర్స్ పిన్నమనేని మాధవి,మామిడిపల్లి సీతారాములు,సీఈవో జ్ఞానదాసు,రైతులు యగ్గడి నరసింహారావు,సతీష్, సిబ్బంది తాజుద్దీన్, గుంటుపల్లి రాఘవులు,శివ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: