మన్యంటివి,దమ్మపేట:- ఏ ఐ కె ఎస్ సి సి ఆధ్వర్యంలో మూడు రైతు వ్యతిరేక వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలని రేపు 26వ తారీఖున గ్రామీణ బందును జయప్రదం కోరుతూ శనివారం స్థానిక సిపిఐ కార్యాలయం నుండి సిపిఐ జిల్లా రైతు సంఘం నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు, సిపిఐ ఎంఎల్ రైతు సంఘం నాయకులు అమర్లపూడి రాము, సిపిఎం రైతు సంఘం నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రైతు సంఘం నాయకులు రాయల జ్యోతి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ ప్రారంభమై పెద్ద గొల్లగూడెం పంచాయితీ అంకంపాలెం, పట్వారి గూడెం, శ్రీరాంపురం మొండివర్రె, నాగు పల్లి, నాచారం, తొట్టి పంపు, సీతారాంపురం, తాటి సుబ్బన్న గూడెం, నాయుడుపేట, మొద్దులగూడెం, అప్పారావుపేట మీదుగా కొనసాగింది ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పండూరు వీరబాబు, నల్ల ప్రసాద్, లక్ష్మీనారాయణ, కొప్పుల శ్రీను, పిల్లి నాయుడు, రావుల శోభనబాబు,తోలెం దుర్గ, ముత్యాలరావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: