గుండాల మన్యం టీవీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గత నెలలో గుండాల మండలం పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించారు. ఆసుపత్రిలో ముఖ్యమైన టీకాలను నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ లేకపోవడం గమనించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రిడ్జ్ వితరణ చేరనున్నట్లు తెలిపారు కాగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక టి.ఆర్.ఎస్ మండల నాయకులు బుధవారం గుండాల మండల ప్రభుత్వ ఆస్పత్రికి ఫ్రిజ్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ మండల నాయకులు మోకాళ్ళ.వీరస్వామి,సయ్యద్.అజ్జు పొంబోయిన.సుధాకర్ గోగ్గేల.లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రవి చంద్ ,సిబంది పాల్గొన్నారు...
Navigation
Post A Comment: