మన్యం టీవి : ·
సారపాక గాంధీనగర్ లో గడ్డి కొప్పుల అనూష (25) అనే వివాహితను ఆమె భర్త గడ్డి కోప్పల జనార్ధన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసు వారి వివరాల ప్రకారం టేకులపల్లి శులనగర్ కు చెందిన గడ్డి కప్పల జనార్ధన్ , అనూష
ఐదు రోజుల క్రితమే సారపాక గాంధీ నగర్ లోని అనూష వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నిందితుడు జనార్ధన్ భార్య ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వీరికి లేఖన ప్రియ (6), హర్షిత (5) పిల్లలు ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడు జనార్దన్ పట్టుకుని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు
Navigation
Post A Comment: