మన్యం టీవీ చర్ల: ఈరోజు చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 కరోనా టెస్టులు చేయగా 14 పాజిటివ్ కేసులు నమోదు అయినవి. చర్ల మండలం లోని పూసు గుప్పా గ్రామంలో 100 కరోనా టెస్టులు చేయగా ఒక పాజిటివ్ కేసు నమోదయింది. చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నమోదైన కేసుల వివరాలు
పాత చర్ల 2.
క్రాంతి పురం 10 .
ఆయిల్ బంక్ ఏరియా 2.
చర్ల మండలం లోని అడవి ప్రాంతంలో ఉన్న గ్రామాల లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజర్ తో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఉదయ రాణి సూచించారు.
Post A Comment: