హైదరాబాద్ :
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని గత ఎన్నికలకు ముందు బిజెపి లో చేరారు డీకే అరుణ. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటానని ఆమె పార్టీ నాయకత్వానికి చెబుతూ వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పదవిని మొదటి నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కట్టబెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. దీంతో డీకే అరుణకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందనే వార్తలు వినిపించాయి. టీఆర్ఎస్ను ధీటుగా విమర్శించే నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణకు మంచి పదవి ఇస్తే.. ఆమె ద్వారా తెలంగాణలో పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావించిన పార్టీ నాయకత్వం.. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు కల్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిజెపి మాజీ ముఖ్యమంత్రులు, కీలకనేతలతో సమానంగా డికె అరుణ కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన లక్ష్మణ్ను బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
....
Post A Comment: