మన్యం టీవి ,
వాజేడు , వెంకటాపురం: స్పెషల్ డిప్యూటీ కోర్టు ని బలోపేతం చేసి ఏజెన్సీ భూ సమస్యలు పరిష్కారించాలి ఏజెన్సీ మండలల్లో 1/70చట్టా విరుద్ధంగా అక్రమంగా పట్టాలు గిరిజనే తరులకు ఎలా చేశారని ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పునేం సాయి అధికారుల పై మండిపడ్డారు ఏజెన్సీ లో బహుళ అంతస్తుల నిర్మాణాలను వెంటనే సీజ్ చేయాలని అన్నారు మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం వాసం నాగరాజు అధ్యక్షుతన ఏర్పాటు చేశారు ఇందులో పూనేం సాయి మాట్లాడుతూ ఏజెన్సీ లో రెవిన్యూ శాఖ ఐటీడీఏ అధీనంలో ఉంచాలని ప్రభుత్వ న్ని కోరారు ఏజెన్సీ లో ఆదివాసి చట్టాలు పూర్తిగా అమలు పరచడం లో గ్రామపంచాయతీ లు పూర్తిగా విఫలమైందని అన్నారు 1/70 , పేసా చట్టాలు ప్రతిష్టంగా అమలు పరచలని డిమాండ్ చేశారు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నా వారికి నోటీసులు జారీచేసి దుకాణాలు నిలుపుదల చేయాలని అన్నారు వీటిపై స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో పూనేం సాయి , వాసం నాగరాజు , పూనేం మునేశ్వరావు , పునేం గోవర్ధన్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: