మన్యం టీవి , హైదరాబాద్ : వీఏవోలకు తీపి కబురు అందిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకువస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. వీఏవోలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్వోలను భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గత మూడేళ్ల నుంచి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు*.
Navigation
Post A Comment: