మన్యం టీవి :
ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో ల వ్యవస్థను రద్దు చేసి నూతన చట్టం ఏర్పాటు చేయడం పట్ల మణుగూరు మండలం జడ్పీటీసీ పొశం నర్సింహారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో బుధవారం భారిగా బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించి, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం నర్సింహారావు
మాట్లాడారు. పాత రెవెన్యూ చట్టం లో అనేక లోసుగులు ఉండడం మూలంగా భూముల రికార్డు కుసంబంధించి పనుల లో జాప్యం చోటు చేసుకునేదన్నారు. నూతనంగా ఏర్పాటుకానున్న రెవెన్యూ చట్టం దేశంలోనే అత్యంత పటిష్టంగా ఉండడమే కాకుండా భూరికార్డుల సంబంధించిన పనులు వేగంగా జరిగే వీలుందన్నారు . ఈ సందర్భంగా నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు పట్ల ప్రజలు ,రైతులు హర్షం వ్యక్తం చేసున్నారు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ విజయకుమారి మాట్లాడుతూ అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ
కె వి రావు,పిఏసిఎస్ కూర్రి నాగేశ్వరరావు,ఎంపీటీసీ అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీ లు గాజుల రమ్య,మచ్చ సమ్మక్క,సరిత, మాజీ ఎంపీటీసీ మేకల రవి,
సర్పంచ్ లు ఏనిక ప్రసాద్, కొమరం జంపేశ్వరి, బొగ్గం రజిత, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,మణుగూరు
టౌన్ ప్రెసిడెంట్ అడపా అప్పారావు,పినపాక యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,
యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్, కో అప్షన్ సభ్యులు బొలిశెట్టి నవీన్, జావిద్ పాషా గాజుల నరేష్,బర్మావత్ నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: