మన్యం టీవి : చర్ల న్యూస్:మావోయిస్టులు చత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వస్తున్నట్లు పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు.ఆదివారం పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా మావోయిస్టులకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు అయినా చతిస్గడ్ లోని సుకుమా జిల్లా కృష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో పామ్ ఏడు అటవీ ప్రాంతంలో లో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతూ ఉన్నట్లు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు ఫోటోలు తీసుకున్నారు. దీనితో అప్రమత్తమైన పోలీసుల బలగాలు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు.
Navigation
Post A Comment: