మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు గోపి రెడ్డి రమణారెడ్డి మన్యం టివి'తో మాట్లాడుతూ, పినపాక శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయిన రేగా కాంతారావు గారి ప్రత్యేక కృషి తో బూర్గంపాడు మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి లో దూసుకుపోతుంది, మండలంలోని సారపాక లో నూతనంగా కోటి 21 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారు. మండలంలోని రైతులు అందరు హర్షించే విధంగా రైతుబంధు వేదికల నిర్మాణం చేపట్టారు, వీటి నిర్మాణం కూడా చివరి దశలో ఉన్నది. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో ఎమ్మెల్యే గారి కృషి వల్ల అధికారులను ముందే అప్రమత్తం చేసి వరద బాధితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వారికి వసతి ఆహారం సమకూర్చారు. నీట మునిగిన పొలాలకు పంట నష్టం అంచనా వేయడంలో కూడా ముందున్నారు. కరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం హోమ్ క్వారంటైన్ లో ఉన్న నిరుపేదలకు పోషకాహారం, నిత్యవసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ చేయడం చేస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
Post A Comment: