మన్యం టీవి :
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం రేపటికల్లా మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయవ్యంగా పయనించవచ్చని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర లో రేపు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర తీరాన 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Post A Comment: