CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు

Share it:


  • కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • టిపియుఎస్‌ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు
  • కొత్త రెవెన్యూచట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లపంపిణీ, బాణాసంచా

మన్యం టీవి :


నూతన రెవెన్యూచట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి దిక్సూచిలా మారాడని టిపియుఎస్‌ వ్యవస్థాపకులు సామా వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లిdలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూచట్టం రైతుల సకల బాధలను తొలగిస్తుందని, దేశచరిత్రలో ఇలాంటి చట్టం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతున్న సందర్భంగా శుక్రవారం, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవుడిలా వచ్చి రైతులబాధలు తీర్చిన కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షధ్వనాలు చేస్తామని, స్వీట్లు పంచుతామని అన్నారు. రైతులకు, ప్రజలకు భూసమస్యలు తొలగించే దేవుడిలా.. అసలైన భూమిపుత్రుడిలా కొత్త చట్టం తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేసీఆర్‌ పండుగను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, సెక్రటరీ జనరల్ నాగేశ్వర్, స్టేట్ కో ఆర్డినేటర్ కాలసాని సంజయ్‌రెడ్డి పాల్గొన్నారు. 
Share it:

TELANGANA

Post A Comment: