మన్యం టీవి , ములుగు& నూగురు వెంకటాపురం : అనాధ, అభాగ్యులు ఆకలితో అలమటిస్తూ ఎక్కడ ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టి ఆదుకోవాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు,ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో (అంగడి) సంత జరిగే ప్రదేశంలో రేకుల షెడ్డు క్రింద ఆకలితో అలమటిస్తూ దీన స్థితిలో ఉన్న అనాధ మహిళకు ఆహారం,పండ్లు అందించి దాతృత్వం చాటుకున్నారు,అనాధ మహిళ పరిస్థితిని సర్వర్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా తెలుసుకున్న తస్లీమా ఆదివారం తన భర్త గఫార్ తో కలిసి వెళ్ళి ఆహారం,పండ్లు అందించారు, అలాగే నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో ఆకలితో ఉన్న అనాధ వ్యక్తి కి అన్నం పెట్టీ ఆకలిని తీర్చారు అనంతరం తస్లీమా మాట్లాడుతూ ఆకలితో ఎవ్వరు ఉన్న ఎలాంటి ప్రతిపాలఫెక్ష లేకుండా పట్టెడు అన్నం పెట్టి వారిని ఆదుకోవాలని తస్లీమా కోరారు,ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదు అని తస్లీమా అన్నారు,
Navigation
Post A Comment: