మన్యం టీవి : చర్ల మండలం దానవాయిపేట గ్రామం లోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన సోయం వీరయ్య అనే వృద్ధుడు ప్రమాదంలో గాయపడి దురదృష్టవశాత్తు ఈనెల 8వ తేదీన చనిపోయిన విషయం మన్యం మీడియా ద్వారా తెలిసింది. ఆయన యొక్క భార్య మణి కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. ఒక్క పూట కూడా తిండి దొరకని అతి నిరుపేద కుటుంబం స్థానిక, గ్రామస్తులు అప్పుడప్పుడు వారి బాగోగులు చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ని బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ ద్వారా రా తెలుసుకున్న దుమ్ముగూడెం మండలం కు చెందిన గ్రామ యువత స్పందించి ఈ నిరుపేద వృద్ధాప్య కుటుంబానికి కి బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ నిర్వాహకులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించి దయ హృదయాన్ని చాటుకున్నారు. దెబ్బ నూతల గ్రామ యువత మాట్లాడుతూ దాతలు ఎవరైనా ఉంటే ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత మరియు నిత్యవసర సరుకులు అయినా అందించగలరని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దంపతుల గ్రామ ఉప సర్పంచ్ సొందే శ్రీను, ఎంపీటీసీ కురసం చిన్నక్క, బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ సభ్యులు, దబ్బ నూతల గ్రామ యువత పాల్గొన్నారు.
Navigation
Post A Comment: