అశ్వాపురం మండలం లోని బిజీ కొత్తూరు, సీతారాంపురం, మొండికుంట వరి సాగు చేసే రైతుల పంట పొలాల దగ్గరకు వెళ్లి పంటను పరిశీలించిన ఏవో సాయి చెంతన్ కుమార్. వరి పంట సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఆకులు ఎండు తెగులు రావడం జరుగుతుందని రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లక్షణాలు ఆకుల చివరల తలచినట్లు గా పసుపురంగు చారలు కనిపిస్తాయి తీవ్రత పెరిగే కొద్దీ ధాన్యం ఉత్పత్తిలో 60% వరకు నష్టం కలుగుతుంది, దీని నివారణకు గాను స్ట్రెప్టోమైసిన్ సల్పేట్,టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 0.1 శాతంలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. తెగులు ఉధృతి 5 శాతం కన్నా ఎక్కువ ఉన్నచో నత్రజని ఎరువు వినియోగం తగ్గించాలి అని రైతులకు సూచనలు ఇచ్చారు.
Navigation
Post A Comment: