తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 20మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ నిర్దారణ అయింది. ఈమేరకు శనివారం ట్విట్టర్ ద్వారా నిర్థారించారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.
Navigation
Post A Comment: