రేగా విష్ణు మోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెన్సార్ శానిటైజర్ మిషన్ అందజేత, ప్రారంభించిన ఎంపీపీ రేగా కాళిక
ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ...రేగా విష్ణు మోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయానికి శుక్రవారం ఎంపీపీ రేగా కాళిక సెన్సార్ శానిటైజర్ మిషన్ అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడారు.కరోనా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కు,శానిటైజర్ వాడాలని,సామాజిక దూరం పాటించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి ఆధికారి డి శ్రీను,సూపరిండెంట్ శ్రీనువాసు,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ సభ్యులు,ప్రసాద్,సత్యనారాయణ,వేణు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: