మన్యం టీవి :
నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తేకఠిన చర్యలు వుంటాయని కరకగూడెం పిహెచ్సీ వైద్యాధికారి పర్షియా నాయక్ అన్నారు. మండలంలోని గ్రామీణ వైద్యులతో గురువారం సమావేశం నిర్వహించి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
గ్రామాల్లో ఎవరైనా దగ్గు, జలుబు,ఆయాసం,ఒళ్ళు నొప్పులు, విరోచనాలు వాసన పసిగట్టక పోవడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వారిని కరకగూడెం వైద్యశాలకు రిఫర్ చేయాలని సూచించారు.గురువారం నుండి ఈ నెల 20 తారీఖు వరకు గ్రామీణ వైద్యులు గ్రామంలో ఎటువంటి వైద్యం చేయడానికి అనుమతి లేదని, వారి వారి ప్రధమ చికిత్స కేంద్రాలు మూసివేయాలి అంతేకాకుండా మొబైల్ సర్వీసింగ్ చేయకూడదన్నారు.ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వైద్యం చేసినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు వుంటాయని కరకగూడెం పిహెచ్ సీ వైద్యాధికారి పర్షియా నాయక్ హెచ్చరించారు.
Navigation
Post A Comment: