CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య.

Share it:

మన్యం టీవి , ఏటూరునాగారం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్షంగా పనిచేస్తుందని ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం అన్నారు. శనివారం మండలంలోని నార్లాపూర్ లో గడిల లక్ష్మి భర్త శ్రీను లకు రూ. 22,500 రూపాయల చెక్కు ను ములుగు జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ సిద్దబోయిన చిన్నక్క ఆధ్వర్యంలో అందజేశారు. గడిల లక్ష్మి భర్త శ్రీను అనారోగ్యంతో ఉండడంతో సీఎం సహాయ నిధికి అప్లై చేసుకోగా వెంటనే మంజూరు చేశారని ఆయన తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.యస్. మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి తాటి రాంచద్, ఎంపిటీసి కుక్కల శ్రీనివాస్, సీనియర్ టి.ఆర్.యస్ నాయకులు సిద్దబోయిన శివరాజు,పగిడిపెల్లి అశోక్, ఎనగంటి భద్రయ్య, రజనికర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: