మన్యం టీవి ,
హైదరాబాద్:
తెలంగాణ రైతు రెవెన్యూ కష్టాల నుండి,విఆర్వోల కబంధ హస్తాల నుండి విముక్తి చెందాలనే రైతు కేంద్ర బిందువుగా కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చారు.రైతుకు కేవలం పంట పండించడమే పనిగా ఉండాలి తప్పా..వేరే కష్టాలు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కోసం కొత్త రెవెన్యూ చట్టం తేవడం సాహసోపేతమైన ప్రయత్నం.ఈ కొత్త చట్టం చారిత్రాత్మకం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా రైతులు, పేదల సంక్షేమం కోసం ఎక్కడా వెనుకడుగువేయని దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్.ఇట్లాంటి సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి గా ఉండడం అదృష్టంగా భావిస్తున్న. చారిత్రాత్మక ఘట్టంలో నన్ను భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Navigation
Post A Comment: