CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి : ఆదివాసి ఐకాస

Share it:

మన్యం టీవి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం మల్లారం గ్రామంలోని గెట్టు నెంబర్ 399/1 లోని ప్రభుత్వ భూమి నందు ఆదివాసులకు కమ్యూనిటీ హాలు ,ప్రజా అవసరాల నిమిత్తం ప్రకృతి వనం గ్రామ సచివాలయం కు కేటాయించిన ప్రభుత్వ భూమి నందు కొంతమంది గిరిజనేతరులు ఆక్రమణల నుండి పరిరక్షించాలని శుక్రవారం నాడు మల్లారం గ్రామస్థులతో కలిసి ఆదివాసి ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత నెల రోజుల నుండి ఆదివాసీలకు గిరిజనేతరుల మధ్య గ్రామాల్లో తీవ్ర వివాదం కొనసాగుతున్న మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.జిల్లా కలెక్టర్ గారు త్వరితగతిన స్పందించి ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మణుగూరు డివిజన్ అధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు,చందా ప్రసాద్,కొమరం శోభనాద్రి,కళావతి నరసమ్మ,సరస్వతి,బాయమ్మ, చంద మహా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: