మన్యం టీవి,
హైదరాబాద్:
తెలంగాణ నూతన రెవెన్యూ చట్టాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చారిత్రాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రైతు రెవెన్యూ కష్టాల నుండి,విఆర్వోల కబంధ హస్తాల నుండి విముక్తి చెందాలనే రైతు కేంద్ర బిందువుగా కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చారు.రైతుకు కేవలం పంట పండించడమే పనిగా ఉండాలి తప్పా..వేరే కష్టాలు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కోసం కొత్త రెవెన్యూ చట్టం తేవడం సాహసోపేతమైన ప్రయత్నం.ఈ కొత్త చట్టం చారిత్రాత్మకం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా రైతులు, పేదల సంక్షేమం కోసం ఎక్కడా వెనుకడుగువేయని దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్.ఇట్లాంటి సమయంలో ప్రభుత్వ విప్ గా ఉండడం అదృష్టంగా భావిస్తున్న. ఏజెన్సీ భూసమస్యలు కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని సీఎం ప్రకటించడం హర్షదాయకం. ప్రతి ఒక్కరూ స్వాగతించే విప్లవాత్మకమైన చట్టం
Navigation
Post A Comment: