మన్యం టీవి : పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి సహాయ సహకారం తో వారి ఆదేశాల మేరకు మల్లెమడుగు పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందని సర్పంచ్ కోడికృష్ణవేణి మన్యం టివి కి తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నాం అని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. కరోనా నానాటికి పెరుగుతున్న క్రమంలో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడం కరోనా బాధితులకు మందులు అందేలా చూడటం జరుగుతుందన్నారు. పంచాయతీలో పారిశుద్ధ్యం ,తాగునీటి కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు అలాగే ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చెల్లించడం కరోనా నేపథ్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులు తమ పంచాయతీలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్నారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం పనులు అనుకున్న గడువులోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
Navigation
Post A Comment: