మన్యం టీవి : మణుగూరు మండలం లోని
ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతిని అన్ని రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తునం అని సర్పంచ్ కొమరం జంపేశ్వరి మన్యం మీడియాకు తెలియచేయడం జరిగింది .పంచాయతీ లో ,విద్య ,వైద్య ఆరోగ్య,డ్రెయినేజ్,
మంచినీరు,వీధి దీపాల ఏర్పాటు లాంటి సమస్య పై ఎక్కువ ద్రుష్టి సారించారు.
గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అందుబాటులో ఉండటం జరుగుతుంది అని తెలియజేసారు .కరోనా వ్యాధి పెరుగుతున్న క్రమంలో ప్రజలకు మనోదేర్యాన్ని కల్పించడం, కరోనా బాధితులకు మందులు అందేలా చూడడం జరుగుతుంది అని అన్నారు అలాగే పంచాయితీలో ఎప్పటికప్పుడుదోమల మందు పిచికారీ చెయ్యడం, బ్లీచింగ్ చల్లడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా పంచాయతీ అబివృద్ధి కి సహకరిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయితి ని ఉత్తమ పంచాయతీగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను అని మన్యం టీవీ కి తెలియజేయడం జరిగింది.
Navigation
Post A Comment: