మన్యం టీవి : దుబ్బాక ఎన్నికలకు గంట మోగింది. నవంబర్ 29లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించిన నేపథ్యంలో దుబ్బాకలో ప్రచారం దుమ్మురేగుతోంది. దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు ప్రచారంలో ముందునుండీ దూసుకుపోతుండగా, దుబ్బాక బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా ఉత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇపుడు మరో అభ్యర్థిని సూచించినట్లు తెలిసింది. అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ఖరారుచేయకపోయినా సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రి హరీష్ రావు దుబ్బాకపై దృష్టి పెట్టారు. వరుస సమీక్షలు, అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీలో టికెట్ కోసం ఏర్పడ్డ గ్రూపులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక ఎలక్షన్కు సంబంధించి టైమ్ ఫిక్సవడం, రెండు నెలల్లోపే ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉండడంతో ప్రచారం ధూంధాం కానుంది. దుబ్బాక లో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ 60వేలకు పైగా ఓట్లు సాధించగా ఇపుడు లక్షకు పైగా మెజారిటీ సాధిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొదటినుంచి టిఆర్ఎస్ ఉప ఎన్నికల ఛాంపియన్ గా ఉంది.
....
Post A Comment: