CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి

Share it:

గుండాల మన్యం టీవీ న్యూస్: అనారోగ్యంతో ఫారెస్ట్ బీట్ అధికారి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన జోగ రాజేష్(25) ఆల్లపల్లి మండలంలోని సందిబందం బీట్ అధికారిగా పని చేస్తున్నాడు. గత నాలుగు రోజుల క్రితం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుండాల ఫారెస్ట్ రేంజర్ మురళి, టిఆర్ఎస్ మండల నాయకులు మోకాళ్ళ వీరస్వామి తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: