మన్యంటివి, అశ్వాపురం : పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సహకారంతో తుమ్మలచెరువు పంచాయతీ అభివృద్ధి పదం తో ముందుకు తీసుకు వెళుతున్నానని సర్పంచ్ బండ్ల సంధ్యారాణి మన్యం టివి కి తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నామని తెలిపారు. ప్రతిరోజు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య భాగంగా చెత్తను సేకరించడం జరుగుతుంది అని తెలిపారు.పంచాయతి లో వైద్య, విద్య ,డ్రైనేజ్ , త్రాగునీరు, వీధిలైట్లు,ఇలాంటి సమస్యలపై ఎక్కువ దృష్టి సాధించామన్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. కరోనా నాటి నాటికి పెరుగుతున్న క్రమంలో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడం కరోనా బాధితులకు మందులు అందేలా చూడడం జరుగుతుందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయడం, బ్లీచింగ్ చల్లడం జరుగుతుందని తెలిపారు. వెంకటాపురం పంచాయతీని ఉత్తమ పంచాయతీగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను అని, డంపింగ్ యార్డు,శ్మశానవాటిక,వైకుంఠ దమం పనులు జరుగుతున్నాయి అని అనుకున్న గడువు లోపే పూర్తి చేస్తాం అని మన్యం టీవీ కి సర్పంచ్ బండ్ల సంధ్యారాణి తెలిపారు.
Navigation
Post A Comment: