- పోడుభూములకు కేసీఆర్ వరం
- ఫలిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషి
- ప్రైవేట్ ఏజెన్సీసర్వేతో.. పొజిషన్లో ఉన్న వారికి హక్కుపత్రాలు
- ఆ తర్వాత ముందుకు వెళ్ళకుండా కట్టడి
- కొత్త రెవెన్యూచట్టంలో ప్రత్యేక ప్రస్తావన
- ఫుల్జోష్లో గిరిజన ఎమ్మెల్యేలు..
- సిఎం నిర్ణయం పై ప్రభుత్వ విప్ రేగా హర్షం
మన్యంటివి, హైదరాబాద్ :
ఏజెన్సీలో తీవ్రంగా ఉన్న పోడుసమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా తేల్చేశారు. రెవెన్యూ చట్టంతో పోడు సమస్యకు చరమగీతం పడుతున్నామని, సుప్రసిద్ద ఏజెన్సీలతో సర్వేనిర్వహించి.. పొజిషన్లో ఉన్నోళ్ళకు హక్కుపత్రాలిచ్చి మరోసారి సమస్య పునరావృతంకాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని సీఎం ప్రకటించడంతో ఏజెన్సీప్రాంత ఎమ్మెల్యేలలో సంతోషం వ్యక్తం అవుతోంది. పోడు సమస్యకూడా ఈ దెబ్బలో పరిష్కారమైతది. ఏజెన్సీలో పొజిషన్లో ఉన్న ట్రైబ్లకు పట్టాలు కూడా ఇచ్చేస్తాం. ఇంకోసారి సమస్యరాకుండా.. ప్రతి అడుగుకు కూడా బౌండర్లు, జియోట్యాగ్లు అన్ని ఫిక్స్ చేస్తం. సకల సమస్యలు, దరిద్రాలు అన్నీ ఒక్క రెవెన్యూ చట్టంతో పోతయి అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పోడుసమస్య కారణంగా ఏజెన్సీప్రాంతంలో అటవీ అధికారుల దాడులు, గిరిజనుల ఆవేదన , ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలతో ఎమ్మెల్యేలు సతమతమవుతుండగా.. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యేలలో మహదానందాన్ని నింపింది. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారాన్ని చూపెట్టడం, మళ్ళీ సమస్యలు రాకుండా పకడ్బందీగా చట్టం చేస్తామని చెప్పడంతో ఎన్నాళ్ళుగానో.. ఎదురుచూస్తున్న పరిష్కారం దొరికిందని ఏజెన్సీ ఎమ్మెల్యేలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పోడుసమస్య పరిష్కరించాలని గత రెండేళ్ళలో పలుమార్లు సీఎం కేసీఆర్ ను కలిసి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విజ్ఞప్తి చేయగా.. దీనిపై సీఎం కూడా స్పష్టమైన హామీనిచ్చారు.
Post A Comment: