మన్యం టీవి ,
పినపాక : టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు బోమ్మర రామ్మూర్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సోంపల్లి తిరుపతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నేతగా రెండు సార్లు మధిర నియోజకవర్గం ఇన్చార్జి గా పనిచేసినారని ,ఎంతో రాజకీయ అనుభవం గల రామ్మూర్తి ప్రతిభను గుర్తించి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. ఉద్యమ సమయంలో రామూర్తి మాదిగ జాతి ని ముందుండి నడిపంచారన్నారు.ఆయన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో లో టీఆరెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల కమిటీ నాయకులు గద్దల నాగేశ్వరరావు, సైదులు, రవితేజ, బాలకృష్ణ, సాంబయ్య, సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: