మన్యం టీవి ,
అశ్వాపురం మండలం లోని నెల్లిపాక బంజర , అమెర్ధ, అమ్మ గారి పల్లి, బట్టీల గుంపు ,ఏరియా లో గోదావరి నీటమునిగిన ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు వ పార్టీ బృందముతో వారి సహాయ సహకారాలతో పలుచోట్ల వరద ముంపుకు గురైన గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా నీట మునిగిన పంట పొలాలను కూడా సంబంధిత శాఖ అధికారులకు తెలియపరుస్తూ నష్టపరిహారం అంచనావేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్. ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న వేళలో మండలంలోని కరోనా బాధితులు యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారికి మెడిసిన్స్, నిత్యావసర సరుకులు అందించడంలో సఫలం అవుతున్నారు. అతి చిన్న వయసులో మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు హర్షించే విధంగా ముందుకు సాగుతూ తనదైన శైలిలో బడుగు బలహీన వర్గాలకు వారి కష్టసుఖాల్లో అండగా ఉంటూ పాలుపంచుకుంటూ సదా ప్రజా సేవలో అంకితం అవుతానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రెవిన్యూ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రజలంతా కూడా హర్షించడం జరుగుతుందని మండల టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: