మన్యం టీవి :
సీఎం కెసిఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పినపాక పంచాయతీ రైతు సమన్వయ అధ్యక్షులు దొడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం మన్యం టీవీ తో అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన అనేక పథకాలురైతులకు మేలు చేశాయన్నారు. ముఖ్యంగా రైతుబంధు ,రైతు బీమా పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్ ,సకాలంలో పాసుపుస్తకాలు అందజేయడం తదితర నిర్ణయాలతో ప్రజలు, రైతులు కష్టాలు తీరాయి అన్నారు .అలాగే మిషన్ కాకతీయ మూలంగా చెరువులలో భూగర్భ జలాలు పెరిగి రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది , అలాగే రైతులను అప్పుల నుండి విముక్తిచేయడానికి రుణమాఫీ తీసుకువచ్చి రైతుల పాలిట సీఎం దేవుడు అయ్యారన్నారు. నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు ప్రకటన దొడ్డ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: