మన్యం టీవి :
మండలకేంద్రానికి సమీప గ్రామము గడ్డంపల్లి2.సుమారు మూడువందల మంది జనాభా ఉన్నారు.వర్షాకాలం, వేసవి అనే తేడా లేకుండా గ్రామానికి త్రాగునీటి కష్టాలే అని గ్రామస్తులు మన్యం మీడియాకు తెలిపారు.గడ్డంపల్లి-2గ్రామానికి ఉన్న ఒకేఒక చేతి పంపు కూడా గత సంవత్సరం పెద్ద వాగు కోత తో కూలీ పోయిందని ఆ నాటినుండి పెద్ద వాగు నీరే తమకు త్రాగునీరు గా దిక్కు గా మారిందన్నారు. దీనితో గడ్డంపల్లి-2గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.తమ సమస్యను విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిష్కరించాలని గడ్డంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.ఇదే విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వై.విజయ్ కృష్ణ ని వివరణ కోరగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మన్యం మీడియా కు తెలిపారు.
Navigation
Post A Comment: