CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశవ్యాప్తంగా మోడీ స్ట్రాటజీ ఒకటే.

Share it:


 దేశవ్యాప్తంగా మోడీ స్ట్రాటజీ ఒకటే. అందరితో మంచిగా ఉండాలి. మంచి నేతలను ఆకర్షించాలి.. బీజేపీని గద్దెనెక్కించాలి. రాష్ట్రాల్లో అధికారం సంపాదించాలి.   దేశాన్ని దున్నేయాలి. అన్ని రాష్ట్రాల్లోనూ అదే చేశారు. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ బలోపేతానికి చిరంజీవిని ఆయుధంగా వాడాలని మోడీ స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం.    అస్సాం నుంచి మొదలుపెడితే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వరకూ అందరు సెలబ్రెటీలు, ప్రముఖులకు బీజేపీ గాలం వేసింది. తమిళనాడులో రజినీకాంత్ ను కూడా ఆకర్షించింది. అయితే ఆరోగ్యం బాగా లేక రజినీకాంత్ బీజేపీలో చేరలేదు. లీడ్ చేయలేదు. ఇక అస్సాంలో అయితే బిశ్వాంత్ అనే కాంగ్రెస్ లీడర్ ను ఆకర్షించిన బీజేపీ ఏకంగా ఆయనను సీఎంను చేసి కీలక నేతగా ఎదిగేలా చేసింది.  ఇప్పుడు ఆంధ్రాలోనూ చిరంజీవికి కొద్దికాలంగా బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఉంది. ఆయనను ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇక ఏపీ బీజేపీకి మరింత ఊపు తెచ్చేందుకు చిరంజీవిని దువ్వుతోంది. ఇప్పటికే అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక కేంద్ర అవార్డును అందజేసి ఆకట్టుకుంది.  ఇక ఈరోజు అవార్డ్ దక్కిన చిరంజీవిని ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్ చేసి మరీ అభినందించారు. చిరంజీవి గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఏపీ బీజేపీలోకి లాగి అన్నాదమ్ములతో కలిసి ఏపీలో బలపడాలని.. రాజ్యాధికారం సాధించాలని చూస్తోంది.  ఇటు పవన్ కు రాష్ట్ర బాధ్యతలు.. చిరంజీవిని కేంద్రంలోని తీసుకోవాలని.. ఏపీలో బీజేపీ బలంగా ఎదగాలని చూస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? సినిమాలు వదిలి చిరంజీవి రాజకీయాల్లో వస్తారా? రారా? అన్నది వేచిచూడాలి.

Share it:

NATIONAL

Post A Comment: