CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్టార్ హీరోయిన్‌తో బాలయ్య రచ్చ ..

Share it:

 


నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు వెండితెరతో పాటు అటు బుల్లితెరను కూడా షేక్ చేసి పడేస్తున్నాడు. ఇటు అన్‌స్టాపబుల్ సీజన్ 2ను హోస్ట్ చేస్తూ బుల్లితెరను షేక్ చేస్తున్నాడు.  అసలు ఆహా టాక్ షో అటు ఆహా వాళ్లకే కాదు. ఇటు బాలయ్యకు కూడా ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్‌కు బాలయ్య ఈ షోతో బాగా కనెక్ట్ అయిపోయాడు.  ఇప్పుడు 10 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు అందరూ జై బాలయ్యా నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. 

ఇక ఇటు సినిమాల పరంగాను దూసుకుపోతున్నాడు. గతేడాది చివర్లో అఖండ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అఖండ జాతర చేసిన బాలయ్య వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు మామూలుగా లేవు.  ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్‌లో బాలయ్య ఒకేసారి త్రిబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఈ షోకు అలనాటి సీనియర్ హీరోయిన్ రాధికతో పాటు బాలయ్య క్లాస్‌మేట్స్ అయిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు సమైక్యాంధ్ర మాజీ స్పీకర్ కేఆర్‌. 

సురేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా రానున్నారు. దీనిపై ఆహా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.  అలాగే రాధికా శరత్‌కుమార్ పవర్ ఫ్యాక్డ్ సెల్ఫీ కూడా పోస్ట్ చేశారు. ఏదేమైనా రాధిక ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆమె కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్‌ను పెళ్లాడడంతో పాటు చెన్నైలో సెటిల్ అయ్యింది. ఇటు కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర చరిత్రలో చివరి ముఖ్యమంత్రి, సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పనిచేశారు. మరి ఈ ముగ్గురి కాంబినేషన్లో ఎపిసోడ్ ఎలాంటి రచ్చ లేపుతుందో ? చూడాలి.

Share it:

CINEMA

Post A Comment: