పినపాక నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది...
-ఎక్కడా లేని అభివృద్ధి ఎమ్మెల్యే రేగా చేస్తున్నారు.
-దమ్మున్న నాయకుడు రేగా.
-మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మన్యం న్యూస్, మణుగూరు , నవంబర్ 21 పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన సోమవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పినపాక ఎమ్మెల్యే దమ్మున్న నాయకుడన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా పినపాక నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు ఎమ్మెల్యే రేగా కాంతారావుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జనం మెచ్చిన నాయకుడు రేగా కాంతారావు అని, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉండాలన్నారు. అంతా కలిసి ఐక్యంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావు మాజీ మంత్రి తుమ్మలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు, బూర్గంపాడు జడ్పీటీసీలు పోశం నరసింహారావు, కామిరెడ్డి శ్రీలత, మణుగూరు మండల, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అడపా అప్పారావు, సీనియర్ నాయకులు కొలేటి భవాని శంకర్, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: