అట్లూరి వెంకీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా సినిమా నిర్మితమౌతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన ధనుష్ అభిమానులకు నిరాశే ఎదురైంది. తమిళనాట స్టార్ నటుడిగా వెలుగొందుతున్న రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా ద్విభాషా చిత్రం వస్తోంది.
అట్లూరి వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళంలో వాతి అని..తెలుగులో సర్ అని టైటిల్స్ ఖరారయ్యాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వెల్లడైంది. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందనే అప్డేట్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాల్సి ఉండగా..కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 17, 2023లో విడుదల చేయనున్నట్టు ప్రకటితమైంది. ఈ సినిమాలో మళయాల నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్పై ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Post A Comment: