CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త

Share it:

 


ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ కీ మంగళవారం విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.  అంతేకాకుండా.. పరీక్షలో పలు క్వశ్చన్లు తప్పుగా వచ్చినట్టు గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు ఆయా ప్రశ్నలకు మార్కులు కలపొద్దని, వాటిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 దీంతో క్వశ్చన్ల సంఖ్యతో పాటు మార్కులు కూడా తగ్గనున్నాయి. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, 2,86,051 మంది హాజరయ్యారు.  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్‌ కీ మంగళవారం టీఎస్‌పీఎస్పీ విడుదల చేసింది. ఫైనల్ కీని తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విషయ నిపుణుల సూచనల మేరకు ఫైనల్‌ కీని రూపొందించామని ప్రకటించింది. కాగా.. ప్రిలిమినరీ కీని ఇప్పటికే విడుదల చేసింది. 

అభ్యంతరాలను స్వీకరించింది. అలాగే, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ నేడు విడుదల చేసింది. ప్రిలిమినరీ కీని అక్టోబర్ 29న రిలీజ్ చెసి.. ఈనెల 4 దాకా అభ్యంతరాలను స్వీకరించారు. ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ నుంచి ఒక్కో కేటగిరీలో 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. వారం, పదిరోజుల్లో హారిజంటల్‌ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి.

Share it:

JOBS

vidya

Post A Comment: