మన్యం న్యూస్, దుమ్ముగూడెం :
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సంవత్సరం ఇంటర్ బై.పీ. సి గ్రూప్ లో అత్యధిక మార్కులు( 907/1000 సాదించి) తో పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందిన మండలపరిధి ఆర్లగూడెం గ్రామానికి చెందిన జలకం.దివ్య శ్రీ ఆర్థిక పరిస్ఠితి సరిగా లేక ఇబ్బందులు పడుతుoది ఈ విషయాన్ని తెలుసుకున్న దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు , విద్యార్థులు పెద్ద మనసుతో స్వదించి తమ వంతు సాయం 6,000/- రూపాయలను విద్యార్థిని దివ్య శ్రీ ని బుధవారం కళాశాలకు పిలిపించి అందజెసారు . మున్ముందు కూడా చదువులకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కలిగితే తమ వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని , మంచిగా చదువుకుని భవిష్యత్ లో స్థిరపడాలని ప్రిన్సిపాల్ ఎల్ వెంకటేశ్వర్లు విద్యార్థినికి.కోరారు దివ్య శ్రీ కి తోడ్పాటు అందించిన అధ్యాపకులను , విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా అభినందించారు .
Post A Comment: