మన్యం న్యూస్, కరకగూడెం: రైతు సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ రేగా .కాళికా మండల అధ్యక్షులు రావుల.సోమయ్య అన్నారు. మండల పరిధిలోని కరకగూడెం గ్రామపంచాయతీలో జరుగుతున్న పోడు భూముల సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతారావు ఆదేశాల మేరకు మండలంలో వివిధ గ్రామాలలో జరుగుతున్న పోడు భూముల సర్వేలో పాల్గొనడం జరుగుతుందన్నారు. అలాగే నేటి తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలే కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా చెరువులు,ప్రాజెక్టులు, చెక్ డ్యామ్ లు కట్టినారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్యాంసుందర్,ఎప్అర్ సి కమిటీ చైర్మన్ నాలి.రామకృష్ణ,ఉపసర్పంచ్ రావుల.రవి,టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా. సత్యనారాయణ,బుడగం.రాము,కంటెం.నగేష్,చిట్టిమల్ల. ప్రవీణ్, కొంపెల్లి చిన్న రామలింగం,రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: