మన్యం మనుగడ, ఏటూరు నాగారం :
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ని జిసిసి డిపో కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రంలోని తెరాస పార్టీ నాయకులు ఆడపడుచులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ సంజీవరావు తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి సలీం,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,ఏటూరు నాగారం సర్పంచ్ రామ్మూర్తి,ఉప సర్పంచ్ కర్ల అరుణ, ఏటూరు నాగారం గ్రామ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ధనపునేని కిరణ్, తెరాస పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు గార ఆనంద్,బట్టు రమేష్,ఎండి ఆరి ఫ్, కొండాయి చిన్ని,అటిక నాగేశ్వరరావు,కొప్పుల శ్రీనివాస్,గుడిమెట్ల కనకతార, సంగం లక్ష్మీ,బాబా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: