మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు పిలుపునిచ్చారు. గురువారం టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం లో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 16న అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శనకు మండలం నుండి 1500 మంది తరలి వెళ్లాలన్నారు. పంచాయతీల వారీగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయటం జరుగుతుందని, అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గాదె శివప్రసాద్, మండల నాయకులు చాపలమడుగు లక్ష్మణరావు, అనుమోలు హనుమంతరావు, కళ్లెం వెంకటేశ్వర్లు, కొమ్మినేని చిన్న లక్ష్మణరావు, చింతల నాగేశ్వరరావు, ఆలకుంట రామదాసు, దండుగుల సాంబశివరావు, తలారి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: