CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు..

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : తెలంగాణ ప్రాంతం పోరాటాలతో నిర్మించబడిందని, నాటినుండి నేటి వరకు  ఈ ప్రాంత ప్రజలు పోరాటాలే జీవనంగా కొనసాగిందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా రైతు వేదికలో జాతీయ జెండాను అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ పార్వతి, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ వర్స రవికుమార్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై విజయలక్ష్మి,జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పంచాయతీ కార్యాలయలలో, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరకుళ్ళ సత్యనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా నాయకులు మాలోత్ భోజ్య నాయక్,సారేపల్లి శేఖర్, భూపతి శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: