CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విఘ్నేశ్వరుడికి వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది.ఇట్టి హామీలు అమలుకోసం మంగపేట మండల కేంద్రంలో వీ ఆర్ఏ ల 38వ, రోజు నిరవధిక సమ్మె లో భాగంగా,రాష్ట వీఆర్ఏ, జేఏసీ , పిలుపు మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ లో వీఆర్ఏ ల గురించి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మండల కేంద్రం లో విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్దలతో  వినతిపత్రం ఇస్తూ వినూత్న రీతిలో తమ నిరసనలను తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు సందీప్, నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మక్క, సమ్మయ్య , రాజేశ్వరి, పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: